జనo పవర్, గంగాధర నవంబర్ 28:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం లో ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సిద్దతలను సమీక్షించేందుకు జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి IAS శుక్రవారం మండలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన
✔️ పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు
✔️ ఓటర్ల జాబితా పరిశీలన
✔️ చట్ట, శాంతి భద్రత అంశాలు
✔️ నామినేషన్ల స్వీకరణ పరిస్థితి
వంటి కీలక అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించి సూచనలు ఇచ్చారు. ప్రజలు భయపడి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.
Post Views: 146









