సకాలంలో రైతులకు యూరియా పంపిణీ

 

జనం పవర్, సిద్దిపేట జిల్లా., ఆగస్టు 16:

జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యంగా ఈ మధ్య రైతులు కొంతమంది యూరియా లేదు అని చెప్పి భయాందోళనలు చెందుతున్నారు. కానీ మన జిల్లా అవసరాలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ వానాకాలంకు సంబంధించి మన జిల్లాకి ఆగస్టు 31931 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 26,500 మెట్రిక్ టన్నుల యూరియాను ఆగస్టు 15 వరకు మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఆ యూరియాని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులకు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికి ప్రభుత్వం తరఫున 21 వేల మెట్రిక్ టన్నుల యూరియా, ప్రైవేట్ డీలర్స్ ద్వారా 5500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 26,500 మెట్రిక్ టన్నుల యూరియా చేయడం జరిగింది. ఇంకా ఆగస్టు 31 వరకు మరో 5500 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరిగిందని సోమవారం నుంచి 3000 మెట్రిక్ టన్నులు వస్తాయని అదే విధంగా వచ్చేవారం ఇంకొక 3000 మెట్రిక్ టన్నులు మొత్తం 6000 మెట్రిక్ టన్నుల యూరియా గవర్నమెంట్ నుంచి వస్తదని మనకు కావలసింది రిక్వైర్మెంట్ 5500 ఉంటే మనకు గవర్నమెంట్ 6000 మెట్రిక్ టన్నుల దాకా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా మరొక వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తుంది. ఈ సీజన్ కు సంబంధించి రైతులకు సరిపడే అయ్యే యురియాను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఏ మండలాల్లో ఎంత యూరియా రైతులకు సరఫరా చేయడం జరిగిందో ఇంకెంత అవసరమవుతుందో సరిచూసుకొని ఆయా మండలాల షాపులకు సరఫరా చేయడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, జిల్లాలో ఇన్చార్జి మంత్రివర్యులు మరియు జిల్లా మంత్రి వర్యులు రెగ్యులర్గా రైతులకు యూరియా సరఫరాపై పర్యవేక్షిస్తూ కావలసినంత ఏరియా జిల్లాకు వచ్చేలా కృషి చేస్తున్నారని యూరియా సరఫరాకు ఎక్కడ కొరతలేదని రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

—జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీచేయనైనది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :