హైదరాబాద్‌ వర్షాల అలర్ట్ – ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసుల సూచనలు

జనం పవర్ – సైబరాబాద్, హైదరాబాద్, ఆగస్టు 11:

 

హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3:00 గంటల నుంచే విడతల వారీగా లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు. ఇలా చేస్తే నగర ట్రాఫిక్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :