జైపూర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వన మహోత్సవం

జనం పవర్ జైపూర్ మంచిర్యాల జిల్లా ఆగస్టు 11:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో వన మహోత్సవం లో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శ్రీమతి వనజా రెడ్డి, తహసీల్దార్ ,శ్రీ శ్రీపతి బాపు రావు ఎంపీవో ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. తహసీల్దార్, ఎంపీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి రోజులల్లో విరి విరి గా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ వాతావరణ సమ తుల్యతకు పాటుపడాలని తెలియజేసినారు.
ఈ కార్యక్రమం లో శ్రీ సంతోష్ డిప్యూటీ తహసీల్దార్, శ్రీ బి. బాలయ్య ఏ పీ ఓ , రామకృష్ణ, ఎఫ్ ఎస్ ఓ, శ్రీమతి కవిత ఐ సి డి స్ సూపర్ వైజర్, బి. ఉదయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రజలు పాల్గొన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :