కరీంనగర్ శాసనసభ
ఎన్నికల సమీక్ష సమావేశం
పాల్గొన్న వివిధ రాజకీయ
పార్టీల నేతలు
జనం పవర్, కరీంనగర్, ఆగస్టు 07
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశం గురువారం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగింది.వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మడుపు మోహన్,బిజెపి నుండి గుగ్గిలపు రమేష్, నాంపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ నుండి సత్తినేని శ్రీనివాస్, టిడిపి నుండి కళ్యాడపు ఆగయ్య, సిపిఎం నుండి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post Views: 51









