చిన్న వైర్యం పెద్ద ప్రాణాన్ని తీసింది ,
కుటుంబ కలహాలతో అన్నను హతమార్చిన తమ్ముడు.
జనం పవర్ న్యూస్ మందమర్రి :
సోమవారం డిసెంబర్ 1 ,
మంచిర్యాల జిల్లా
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్రోన్పల్లి గ్రామంలో సోమవారం రోజు రాత్రి సుమారు 8:00 గంటల సమయంలో కుటుంబ కలహాలు ఒక హత్యకు దారితీశాయి. సొంత తమ్ముడు తన అన్నను రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
సంఘటన వివరాలు:
మృతుడి
పేరు: మెండ్రపు గోపాల్,
వయస్సు: 35 సంవత్సరాలు,
తండ్రి పేరు: భీమయ్య
కులము: నాయక్పోడ్,
వృత్తి: మేస్త్రీ ,
గ్రామము: సన్రోన్పల్లి,
నిందితుడి పేరు: మెండ్రపు కుమార్,
వయస్సు: 34 సంవత్సరాలు,
తండ్రి పేరు: భీమయ్య
కులము: నాయక్పోడ్
వృత్తి: కూలీ
గ్రామము: సన్రోన్పల్లి ,సంఘటన నేపథ్యం:
సన్రోన్పల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన గోపాల్ (అన్న),కుమార్ (తమ్ముడు) మధ్య కుటుంబ కలహాలు చెలరేగాయి. ఈ క్రమంలో, నిందితుడైన కుమార్ ఆగ్రహంతో రోకలి బండ తో అన్న అయిన గోపాల్ను తల మీద గట్టిగా కొట్టి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన పూర్తి వివరాలకై దర్యాప్తు చేస్తున్నారు.








