జనం పవర్ గంగాధర నవంబర్ 30:
నామినేషన్ వేయడానికి వెళ్ళే అభ్యర్థి కోసం ఏకంగా ఊరు మొత్తం తరలి వచ్చిన జనం. జన సంద్రం చూస్తే నామినేషన్ కి వెళ్తున్నారా లేదా గెలిచిన విజయ యాత్ర చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.
నా బూతో నా భవిష్యత్ ఇతి దృశ్యం అన్న చందం గా ఉంది
వివరాల్లోకి వెళ్తే గంగాధర మండలం మధురానగర్ సర్పంచ్ బరిలో ఈ సారి ఊరికే పెద్ద మనిషి అయినటువంటి , మంచికైన, చేడుకైన నేనున్న అని చెప్పే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఒడ్నాల రామ్ మోహన్… ఎప్పుడూ అన్నింటిలోనూ ఏ ఆపద ఉన్న తనే ముందుండే వ్యక్తి, స్వతహాగానే సౌమ్యశాలి ఇప్పుడు అనూహ్య రీతిలో సర్పంచ్ కి పోటీ చేశారు. ఆయనకి తోడు ఆయన కుమారుడు మండల కేంద్రంలోని గ్రామలతో తేడా లేకుండా ఎవరు ఆపదలో ఉన్న తన వంతుగా సహాయం చేసే వ్యక్తి, చిన్న వయసు నుండే తన తండ్రి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువకుడు , అంచెలంచెలుగా ఒక కాంగ్రెస్ కార్యకర్త నుండి ఈ రోజున చొప్పదండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు.
అంతటి కథ ఉన్న వీళ్ళ ముందు ఎవరు గెలువగలరు అనే చందంలో ఉంది ఈ నామినేషన్ వేసిన విధానం
నామినేషన్ స్క్రూటినీ అయిపోయింది ఎలక్షన్స్ డిసెంబర్ 11 న జరగనున్నాయి.
ఏదేమైనా గంగాధర చరిత్రలో ఇలాంటి ఎన్నికలు జరగబోవు ఏమో అన్నట్టుగా పోటాపోటీ నడుస్తుంది. అని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








